Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ లీటర్పై 15 పైసలు..
- వరుసగా మూడో రోజు..
- ఎన్నికల వరకు పెరగని ధర
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోబాదుడుకు కొద్దిగా విరామమిచ్చిన మోడీ సర్కారు.. ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ చమురు ధరల పెంపు ఆపరేషన్ మొదలు పెట్టింది. శనివారం వరుసగా మూడో రోజూ పెట్రోల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. మెట్రో నగరాల్లో లీటరు పెట్రోల్పై 14పైసలు పెరగ్గా, చెన్నైలో మాత్రం 15పైసలు పెరిగింది. దీంతో వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర అత్యధికంగా రూ.79.44లకు ఎగబాకింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.73.77కు చేరుకోగా, కోల్కతాలో రూ.76.47కు దూసుకెళ్లింది. చెన్నైలో రూ.76.68కి పెరగ్గా, హైదరాబాద్లో రూ.78.50కు చేరుకుంది. కాగా, మూడు రోజుల్లో చెన్నైలో లీటరు పెట్రోల్పై 50పైసలు పెరగ్గా, మిగతా మూడు నగరాల్లో 47పైసలు పెరిగింది. మోడీ సర్కారు ఇలా వరుసగా చమురు ధరలను పెంచుతుండటంతో సామాన్య వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.