Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడీఆర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : హర్యానాలో కొలువుతీరిన బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని 12 మంది మంత్రులు కోటీశ్వరులేని తేలింది. వీరిలో వ్యవసాయ, కుటుంబ సంక్షేమ మంత్రి జై ప్రకాష్ దలాల్ రూ.76 కోట్లతో అత్యంత సంపన్న మంత్రి కాగా, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా రూ.74 కోట్ల ఆస్తులతో తర్వాతి స్ధానంలో నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక తాజాగా వెల్లడించింది. 2014లో హర్యానా సర్కార్లో 10 మంది మంత్రుల్లో ఏడుగురు కోటీశ్వరులుగా ఈ నివేదిక విశ్లేషించింది. ఇక 12 మంది కరోడ్పతి మంత్రుల్లో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరు కావడం గమనార్హం. మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ.17.41 కోట్లని నివేదిక పేర్కొంది.