Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒడిషా: మొదటిసారి రాత్రివేళ నిర్వహించిన మధ్యతర స్థాయి బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని-2' పరీక్ష విజయవంతమైంది. ఈ క్షిపణి భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేలా రూపొందించారు. ఈ పరీక్షను శనివారం ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లోని కాంప్లెక్స్-4 వేదికగా ప్రయోగించామని రక్షణ శాఖ తెలిపింది. ఈ క్షిపణి దాదాపు 20 మీటర్ల పొడవు, సుమారు 17 టన్నులు బరువు ఉంటుందనీ, 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంటుందని తెలిపారు. అలాగే మరో 1000 కేజీల పేలోడ్ను మోసుకెళ్లగల శక్తి ఈ క్షిపణి సొంతమని వెల్లడించారు. అగ్ని- 2 క్షిపణిని మొదటిసారి 1999 ఏప్రిల్ 11న పరీక్షించారు.