Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణశాఖ సహాయ మంత్రి ప్రశంసలు
పనాజీ: జనావాసాల్లో కూలిపోయే యుద్ధ విమానాన్ని నియంత్రించి నిర్జన ప్రదేశంలో పడేలా చేసి, పెను ప్రమాదాన్ని తప్పించిన మిగ్-29కే పైలెట్లను కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. 'పైలెట్లు కెప్టెన్ షియోఖండ్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్లు ఉన్నతమైన విధిని నిర్వర్తించారు. మీ సమయస్పూర్తి అద్భుతం. ఒత్తిడి సమయంలోనూ ధైర్యంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించారు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని శ్రీపాద్ అభినందించారు.
కాగా, భారత యుద్ధ విమానం మిగ్-29కే గోవాలోని వెర్నా గ్రామ సమీపంలో శనివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదాన్ని ముందే గుర్తించిన పైలెట్లు నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అదే సమయంలో విమానంలో ఉన్న పైలెట్లు క్షేమంగా బయటపడ్డారు. అయితే వీరు చూపిన చొరవను ఆ జిల్లా కలెక్టర్ సైతం అభినందించారు.