Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలుచోట్ల ఆభరణాలు తెంచుకుని పరారీ
గుంటూరు : శ్రావణమాసం, రాఖీ పండగను పురస్కరించుకుని పలువురు ఆభరణాలు ధరించిన నేపథ్యంలో చైన్స్నాచర్లు చెలరేగారు. ఎక్కడంటే అక్కడ అపహరణలకు యత్నించడంతో గుంటూరు నగరవాసులు బెంబేలెత్తిపోయారు. స్థానిక పట్టాభిపురం పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం ఒక్కరోజే ఏకంగా ఆరు కేసులు, నల్లపాడు పోలీస్స్టేషన్ పరిధిలో రెండు, అరండల్పేట స్టేషన్ పరిధిలో ఒకటి నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుండి 9.50 గంటల మధ్యలో పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు నడిచి వెళుతున్న మహిళల మెడల్లోంచి గొలుసులను తెంచుకుని పరారయ్యారు. శుక్రవారం రాత్రి రెండు ప్రాంతాల్లో ఇదేతరహాలో చైన్స్నాచింగ్కు పాల్పడినట్లు ఫిర్యాదులందాయి.