Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్టిఆర్ ట్రస్ట్భవన్లకు స్థలాలు
- వంద గజాల వరకు క్రమబద్ధీకరణ
- ఎటాచ్డ్ ఆస్తులు రాష్ట్రానికే ఇవ్వాలి
- అపోలో ఫౌండేషన్కు చిత్తూరు ఆస్పత్రి
- సర్పంచ్, జెడ్పిటిసిలకు జీతాల పెంపు
- ఏపి మంత్రివర్గ తీర్మానాలు
విజయవాడ:ఏపి రాష్ట్రంలో మరిన్ని ప్రయవేట్ యూనివర్శిటీల ఏర్పాటుకు వీలుగా బిల్లు తెచ్చేందుకు మంత్రి మండలి ఆమోదించింది. దేశంలో ఉన్న 20 ప్రయివేటు ప్రధాన యూనివర్శిటీలకు అవకాశం కల్పించి, ప్రభుత్వం ప్రోత్సాకాలివ్వాలని కేబినెట్ తీర్మానించింది. ఈడీ రాష్ట్ర పరిధిలో ఇంతవరకు ఎటాచ్ చేసిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికివ్వాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడలో శనివారం ఏర్పాటైన కేబినెట్ సమావేశం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగిన ఈ సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. సోంపేటలో విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు నాగార్జునా కంపెనీకి ఇచ్చిన 972 ఎకరాలను వెనక్కు తీసుకుంటూ 1107 జిఒను రద్దు చేస్తూ తీర్మానించారు. పట్టణ ప్రాంత ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్న బిపిఎల్ కుటుంబాల వారికి 100 గజాల స్థలాన్ని ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని తీర్మానించారు. ఎన్టిఆర్ ట్రస్ ్టభవన్కు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారు. వ్యవసాయ మార్కెట్లలోని ఆన్లైన్ వ్యవస్థను జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేయాలని, ఏకీకృత లైసెన్సు విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు మార్కెట్ల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వడం ద్వారా జాతీయ వ్యవసాయ మార్కెటింగ్లో భాగస్వామ్యం కావాలని తీర్మానించింది. రాష్ట్రంలో తొలిదశలో పది మార్కెట్ యార్డుల్లో ఈ విధానం ప్రవేశపెట్ట నున్నారు. దేవాదాయశాఖ ట్రస్ట్ బోర్డుల పదవులను రెండేళ్లకు పొడిగించారు. చిత్తూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలను అపోలో ఎడ్యుకేషన్ ఫౌండే షన్కు అయిదేళ్ల లీజుకు అప్పగించారుర. మిగిలిన ఆస్పత్రులను ఎవరైనా ముందుకొస్తే కేటాయించేం దుకు ముగ్గురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా అవినీతికి పాల్పడితే 18 నెలల్లో వారి ఆస్తులు జప్తు చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలనీ, ప్రత్యేక కోర్టునూ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాలని తీర్మానించారు. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలనీ మంత్రివర్గం నిర్ణయించింది. అగస్టు 29వ తేదీని తెలుగు భాషాదినోత్సవంగా ప్రకటిం చింది. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే నిర్వహిం చాలని, ఇంటర్మీడియట్ వరకూ తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరి చేయాలని, రాష్ట్రంలో దుకాణాలు, ప్రదర్శనల బోర్డులన్నీ తెలుగులోనే ఉండాలని కేబినెట్ తీర్మానించింది. తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలు, కట్టుబాట్లను అభి వృద్ధి చేసేందుకు ముగ్గురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. తెలుగును విశ్వవ్యాప్తం చేసిన శ్రీ కృష్ణదేవరాయలు, నందమూరి తారక రామారా వులకు గుర్తింపు కల్పించాలని కేబినెట్లో తీర్మానిం చారు. రాష్ట్రంలో 70 వేల నుంచి 75 వేల వరకు వెటర్నరీ గ్రాడ్యుయేట్ పోస్టులుండగా 34,500 మాత్రమే ఉన్నారని, వీరి సంఖ్యను పెంచాలనీ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు వెటర్నరీ, డెయిరీ, ఫిషరీస్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వరా వెటర్నరీ కశాశాల ఏర్పాటు చట్టాన్ని సవరించాలని తీర్మానించారు. ఇందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. రాష్ట్రంలో అన్ని అధునాతన సదుపాయాలతో గ్రీన్ ఫీల్డు యూనివర్శిటీలు నిర్మించేందుకు ప్రాధాన్యమివ్వాలని టిటిడి బోర్డులో ఎక్స్అఫిషియో హోదా నుంచి తుడా ఛైర్మన్ను తొలగించారు. స్వచ్ఛభారత్లో భాగంగా చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేసే బయోగ్యాస్ ప్లాంట్లకు, ఆర్ఎల్ఎన్జి గ్యాస్ బేస్డ్ ప్లాంట్లకు 14.5 శాతం వ్యాట్ను రద్దు చేశారు. పేపరు పరిశ్రమకు అవసరమైన సుబాబుల్ వంటి ముడిసరుకుపై వ్యాట్ను 14.5 శాతం నుండి 5ు శాతానికి తగ్గించారు. జిల్లా పరిషత్ అధ్యక్షుల గౌరవ వేతనాన్ని రూ.7500 నుండి రూ.40 వేలకు పెంచారు. జెడ్పిటిసి సభ్యులు, ఎంపిపిలకు రూ.6000, సర్పంచులు, ఎంపిటిసిలకు రూ.3000 ఇవ్వాలని తీర్మానించారు. నీటి వినియోగదారుల సంఘాలను పునరుద్ధరించి, అధ్యక్షుడు, డైరెక్టర్లను ఎన్నుకునే బాధ్యతను గ్రామాలకే అప్పగించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 419 ఎకరాల్లో ఇళ్లేసుకున్న వారికి వాటిని రెగ్యులరైజ్ చేయనున్నారు. ఈ గవర్నెన్స్్కు అధిక ప్రాధాన్య మిచ్చేందుకు ఐటి, ఎలక్ట్రానిక్ పరిశ్రమను అభివృది ్ధచేయాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్నవారి మృతికి సమావేశం సంతాపం తెలిపింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రైవేటు ఆర్థిక సంస్థలను నియంత్రించేందుకు కలెక్టర్లకు అధికారాలివ్వాలనే చర్చ జరిగినా దానిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.
బంద్ ప్రశాంతం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను అరెస్టు చేశారు. బంద్కు మద్దతుగా ర్యాలీలు చేసిన వామపక్ష నాయకులనూ, కార్యకర్తలను కూడా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. కొన్నిచోట్ల నాయకులను అరెస్టు చేశాక బస్సులను తిప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. దుకాణాలను మూసివేసి వ్యాపారులు బంద్కు సహకరించారు. విద్యాసంస్థలు పనిచేయలేదు. రాజమండ్రిలో అరెస్టయిన వైసిపి కార్యకర్తలు ప్రకాశ్నగర్ పోలీసు స్టేషన్పై దాడికి దిగి, స్టేషన్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. అడ్డుకున్న ఎస్ఐ శివ గణేష్, కానిస్టేబుల్ గంగాధర్, నాగేశ్వరరావు గాయపడ్డారు.