Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
- బెంగాల్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- ప్రజల డిమాండ్లు వినండి : షాహీన్బాగ్ ర్యాలీలో తుషార్గాంధీ
- జామా మసీదు వద్ద ర్యాలీలో భీమ్ ఆర్మీ చీఫ్
- సీఏఏ, ఎన్నార్సీని అమలుచేసే ప్రసక్తే లేదు : పినరయి విజయన్
న్యూఢిల్లీ, కోల్కతా : మోడీ సర్కారు రాజేసిన 'పౌర' చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. నెలరోజులు దాటినా దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)లను నిరసిస్తూ ప్రజల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధానిలోని జామా మసీదు, షాహీన్బాగ్తో పాటు ముంబయి, మధ్యప్రదేశ్లోని జబల్ పూర్, కేరళలోని పలు ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. సీఏఏకు సంబంధించిన ప్రక్రియ ను ప్రారంభించాలని మోడీ సర్కారు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృత మవుతున్నాయి. జామా మసీదు వద్ద జరిగిన భారీ ర్యాలీలో ఇటీ వలే బెయిల్పై విడుదలైన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజా ద్ పాల్గొన్నారు. 'నిరసనకారులు వేసుకున్న దుస్తులను బట్టి వారెవరో చెప్పవచ్చున'ని మోడీ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఆజాద్ అన్నారు. వివాదాస్పద చట్టాన్ని వెంటనే వెనక్కితీసు కోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు షాహీన్ బాగ్లో మహిళలు పెద్దఎత్తున సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళ నలు చేపట్టారు. వీరికి స్థానికంగా వ్యాపారాలు చేసే వర్తకులు సైతం మద్దతు తెలిపారు. నిరసనకారులకు పంజాబ్ నుంచి వచ్చిన రైతులు సంఘీభావం తెలపడమే గాక వారికి సాయంత్రం పూట వంటలు చేసి వడ్డించారు. జబల్పూర్లో భారీఎత్తున ప్రజలు సీఏఏను నిరసిస్తూ భారీ ర్యాలీ తీశారు.
ఎన్నార్సీ భయంతో... వ్యక్తి ఆత్మహత్యాయత్నం
జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ) ఆందోళనతో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఘటన శుక్రవారం బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా బసంతియా గ్రామానికి చెందిన తాహీరుద్దీన్ కొన్నాళ్లుగా ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో కేంద్రం దీనిపై వెనక్కి తగ్గపోగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టాలని రాష్ట్రాలను ఆదేశించిన నేపథ్యంలో కలతచెందిన తాహీర్ శుక్రవారం తన ఇంట్లో నిప్పంటించుకున్నాడని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అతడికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదనీ, కానీ కొంతకాలంగా సీఏఏ, ఎన్నార్సీల గురించి చుట్టుపక్కల వారితో చర్చిస్తూ ఆందోళనకు గురువుతున్నాడని వారు చెప్పారు. కాగా, తీవ్రంగా గాయపడిన తాహీర్ను సమీపంలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అణగారిన వర్గాల్లో ఆందోళన
న్యూఢిల్లీ : ప్రజల్ని మతపరంగా విడగొట్టడానికి మోడీ సర్కార్ సీఏఏ, ఎన్పీఆర్లను తీసుకొచ్చిందని 'సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వ్యతిరేక సంఘం' ఆరోపిం చింది. రోహిత్ వేముల వర్దంతి (జనవరి 17) సందర్భం గా దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాల్ని జరుపుతున్నామని సంఘం కన్వినర్ అనిల్ చామాడియా శుక్రవారం మీడియాకు తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీలు అమల్లోకి వస్తే ముస్లింలే కాదు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీ వర్గాలపై ప్రభావముంటుందని ఆయన అన్నారు. సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలనీ తమ సంఘం డిమాండ్ చేస్తున్నదనీ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై మోడీ సర్కార్ తన ప్రయత్నాలు విరమించుకోవాలనీ ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. అనిల్ చామాడి యా మీడియాతో మాట్లాడుతూ...''హైదరాబాద్ సెంట్ర ల్ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యను దేశ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. రోహిత్ వేముల ఎదుర్కొన్న పరిస్థితులే నేడు అనేక విశ్వవిద్యాలయాల్లో నెలకొన్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక..దళితులు, ఆదివాసీ లు, ఓబీసీలు, మహిళలు, మైనార్టీలలో అభద్రత పెరిగిపో యింది. ఇప్పుడు సీఏఏ, ఎన్నార్సీలతో అణగారిన వర్గాలు మరింత ఆందోళన చెందుతున్నాయి'' అని అన్నారు.
రాజ్యాంగ విరుద్ధం : జేఎన్యూ ప్రొఫెసర్
భారత రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సమాన త్వానికి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వ్యతిరేకం. 'మను వాదు'ల ఆలోచనల్లోంచి ఈ చట్టాలు పుట్టుకొచ్చాయి.
ఆదివాసీలనూ నిర్బంధ కేంద్రాలకు పంపిస్తారా? : ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్
ప్రజల్లో మత విద్వేషాన్ని రగల్చడానికే ఈ చట్టాల్ని తెచ్చారు. దళితులు, ఆదివాసీలు సరైన ధ్రవపత్రాలు చూప లేకపోతే డిటెన్షన్ కేంద్రాలకు తరలిస్తారా? ఏ దేశానికీ చెంద ని ప్రజలుగా వారిని మారుస్తారా? సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీ ఆర్లు అమలైతే...వలస కూలీలు, పేదల పరిస్థితేంటి ?