Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇస్రో ప్రయోగం విజయవంతం
- బలోపేతం కానున్న కమ్యూనికేషన్ వ్యవస్థ
న్యూఢిల్లీ: సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక వ్యవస్థ కలిగిన 'జీశాట్-30' ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానాలోని యూరోపియన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్ -5 రాకెట్ ద్వారా నిర్ధిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టింది. శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు జీశాట్-30తో అంతరిక్ష వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ పోర్టులోని 3వ ఏరియన్ లాంచ్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగం జరిగినట్టు ఇస్రో వెల్లడించింది. కాగా, జీశాట్-30 ఉపగ్రహం బరువు 3,357 కిలోలు. ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీనిద్వారా టెలివిజన్, టెలీకమ్యూనికేషన్ బ్రాడ్కాస్టింగ్కు సంబంధించిన సేవలు మరింత బలోపేతం కానున్నాయి. ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్లలో సమాచార సేవల్ని అందిస్తుంది. ఇన్శాట్-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్-30 ఉపగ్రహం పనిచేయనుంది.