Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నిర్భయ కేసులో దోషులకు తాజాగా మరోసారి ఢిల్లీకోర్టు డెత్వారెంట్ జారీచేసింది. వచ్చే నెల 1న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశిం చింది. ఈ కేసులో దోషి ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. కాగా, ఈ కేసులో తొలుత ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ కేసులో దోషి ముకేశ్ కుమార్ సింగ్ క్షమాభిక్ష దాఖలు చేశాడు. నిబంధనల ప్రకారం.. ఒకే కేసులో ఒకరి కంటే ఎక్కువమంది దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్న సందర్భంలో.. ఏఒక్క దోషి అయినా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని అభ్యర్థించి ఆ పిటిషన్ ఆమోదించిన లేదా తిరస్కరించినా ఉరిశిక్ష అమలుకు కనీసం 14 రోజుల కాలవ్యవధి ఉంటుంది. దోషి ముకేశ్ సింగ్ కుమార్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ తిరస్కరించిన వెంటనే దోషులకు ఉరిశిక్ష అమలు చేయడానికి నూతన షెడ్యూల్ జారీచే యాల్సిందిగా ఢిల్లీకోర్టును తీహార్ జైలు అధికారులు ఆశ్రయించారు. అయితే క్షమాభిక్ష పిటిషన్ను కొట్టివేసిన విషయాన్ని దోషికి అందజేసిన అనంతరం ఢిల్లీ కోర్టు .. దోషులకు నూతన డెత్వారెంట్ను జారీ చేసింది.