Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఎన్ఎస్ఏ' చట్టం కింద ఢిల్లీ పోలీస్కు ప్రత్యేక అధికారాలు
- నిరసనల్ని అణచివేసేందుకు ఇదంతా: రాజకీయవర్గాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసు కమిషనర్కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జారీచేసిన ఆదేశాలు రాజకీయవర్గాల్లో, ప్రజా స్వామ్యవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. 'పౌర' నిరసనల్ని అణచివేయటం కోసమే మోడీ సర్కార్ పోలీసులకు విశేష అధికారాల్ని కట్టబెట్టిందని వార్తలు వెలువడుతున్నాయి. ఎన్ఎస్ఏ చట్టం కింద ఎవర్నైనా...ఎక్కడైనా నిర్బంధించే అధికారాలు ఢిల్లీ పోలీసు కమిషనర్కు కల్పిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ జనవరి 10న ఆదేశాలు జారీచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, జాతీయ భద్రతకు ప్రమాదంగా భావిస్తున్నామని...ఒక వ్యక్తిని 12నెలలపాటు నిర్బంధించే అధికారాలు పోలీసులకు ఇచ్చారు. నాలుగు నెలలపాటు ఈ ఆదేశాలు అమల్లోఉంటాయని నోటిఫికేషన్లో గవర్నర్ తెలిపారు. అయితే ఈ నిర్ణయం పట్ల రాజకీయ వర్గాల్లో, పౌరహక్కుల నేతల్లో ఆందోళన వ్యక్తమైంది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నవేళ ఇటువంటి ఆదేశాలు జారీచేయటాన్ని వారు తప్పుబడుతున్నారు. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనల్ని అణచివేయడానికే ఇలాంటి అధికారాలు పోలీసులకు కట్టబెట్టారని వారు ఆరోపించారు. ఎన్ఎస్ఏ కింద అరెస్టు అయితే నిందితుడు న్యాయవాదిని పెట్టుకునే అవకాశం లేదు. పోలీసుల నిర్బంధాన్ని కేవలం హైకోర్టులో మాత్రమే సవాల్ చేసే అవకాశం ఉంది.