Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లింలను భయపెట్టే నిర్ణయాలు
- దావోస్ వేదికగా మోడీపై బిలియనీర్ జార్జి సోరోస్ తీవ్ర వ్యాఖ్యలు
దావోస్: ప్రధాని నరేంద్రమోడీపై దావోస్ వేదికగా బిలియనీర్ జార్జి సోరోస్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన మోడీ పౌరసత్వ చట్టంతో భారత్ను హిందూ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సోరోస్ అన్నారు. జాతీయవాదాన్ని తిరగబెడ్తున్నారు. మరింతగా దానిని ముందుకు తీసుకెళ్తున్నారు. దాంతో, వేలమంది ముస్లింల పౌరసత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదమున్నదన్నారు. భారత్లో పరిస్థితులు కోట్లాది ముస్లింలను భయపెట్టే విధంగా ఉన్నాయన్నారు. కాశ్మీర్పై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శించారు.
హంగేరీకి చెందిన జార్జి సోరోస్కు అమెరికా పౌరసత్వం కూడా ఉన్నది. డొనాల్డ్ ట్రంప్పైనా సోరోస్ విమర్శలు గుప్పించారు. తన స్వలాభం కోసం దేశ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టే వ్యక్తిత్వం ట్రంప్దని సోరోస్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి ఏమైనా చేసే మనస్తత్వం ఆయనదని విమర్శించారు. ప్రపంచమంతా తన చుట్టూ తిరగాలని ట్రంప్ భావిస్తారని, అది ఓ రకమైన రోగ లక్షణమని ఎద్దేవా చేశారు. ట్రంప్ బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకోగల సామర్థ్యం చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఉన్నదన్నారు. కృత్రిమ మేధతో తన దేశ ప్రజలను తన అదుపులో ఉంచుకోగలరంటూ జిన్పింగ్ను కొనియాడారు.