Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్పథ్లో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బొల్సోనారో హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలాసీతారామన్ ఈ వేడుకలకు హాజరయ్యారు.