Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చదువురాని, బుర్కా ధరించినవారు అక్కడ కూర్చుంటున్నారు
- 'షాహీన్బాగ్, పార్క్సర్కస్'పై బీజేపీ నేత వివాదాస్పదవ్యాఖ్యలు
న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఆందోళనచేస్తున్న వారిపై బీజేపీ బెంగాల్ నేత దిలీప్ ఘోష్ మరోసారి నోరుపారేసుకున్నారు. 'చదువురాని, సాధారణ, బుర్కా ధరించి, పేదరికంతో బాధపడుతున్న ప్రజలు ఢిల్లీలోని షాహీన్బాగ్, కోల్కతా పార్క్సర్కస్లో డబ్బు, బిర్యానీల కోసం రోజులతరబడి రోడ్ల మీద కూర్చుంటున్నారు. విదేశాల నుంచి వస్తున్న నిధుల నుంచి వారికి ప్రతి రోజూ డబ్బు ఇస్తున్నారు.. బిర్యానీ తినిపిస్తున్నారు' అన్నారు. కోల్కతాలో శనివారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీ నేతలపై కూడా ఘోష్ విమర్శలు చేశారు. 'చాలా పార్టీల జాతీయ నాయకులు బెంగాల్కు వస్తారు. కానీ వారి ప్రసంగాలను ఎవరూ వినరు' అన్నారు. 'కరత్, చిదంబరం లాంటివారు ఢిల్లీలో వున్నప్పుడు షాహీన్బాగ్ వద్ద, బెంగాల్కు వచ్చినప్పుడు పార్క్సర్కస్ వద్ద ప్రసంగిస్తారు. వారి మాటలు ఎవరు వింటారు? కొంతమంది చదువురాని, బుర్కా ధరించిన మహిళలు పిల్లలతో అక్కడ కూర్చుంటున్నారు. జాతీయ నాయకుల ఏకైక ప్రేక్షకులు వారే' అన్నారు. రోజులతరబడి జరుగుతున్న నిరసనలకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయంటూ దిలీప్ ఘోష్ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వాస్తవం ఏమిటో బయటపడుతుందన్నారు.