Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ద్రవ్యలోటు లక్ష్యాన్ని సడలించటం, ఆదాయపు పన్ను సులభతరం చేయటం వంటి సానుకూల అంశాలున్నప్పటికీ, భవిష్యత్పై సరైన దృక్పథం లేకపోవటంతో ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశాజనకంగా మిగిలిందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఇసీఎ-పీఎం) సభ్యురాలు ఆషిమా గోయెల్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో 'మాంద్యం' పదాన్ని ప్రస్తావించకపోవటం తనకు ఎటువంటి ఆశ్చర్యమూ కలిగించలేదని అన్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలెప్మెంట్ రిసెర్చ్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆషిమా గోయెల్ ప్రసంగించారు. ద్రవ్యలోటుకు, అభివృద్ధి సాధనకు మధ్య సమతుల్యత సాధించే బడ్జెట్లో వ్యయంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం భవిష్యత్ దృక్పథం ఏమిటన్నది ఈ బడ్జెట్ ఆవిష్కరించకపోవటం తీవ్ర నిరాశను కలిగించిందని, భవిష్యత్ ఆలోచనలను బడ్జెట్లో వెల్లడించాల్సిన అవసరం వుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ మాంద్యం గురించి కలవరపడుతున్న సమయంలో ఆర్థిక మంత్రి తన మూడు గంటల ప్రసంగంలో మాంద్యం అన్న పదాన్ని ఉపయోగించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఈ మాంద్యాన్ని బడ్జెట్ ఏ విధంగా అడ్డుకుంటుందన్న అంశంపై మంత్రి ఎక్కడా చర్చించలేదని ఆమె అన్నారు. ఎఫ్ఆర్బిఎం చట్టం నుండి నిష్క్రమణ నిబంధనను ప్రవేశపెట్టటం, 2008 నాటి ఆర్థిక సంక్షోభానం తర పరిస్థితుల్లో అనుసరించిన విధానాలను అనుసరించబోమని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆమె చెప్పారు. పన్ను విధానాలను సరళీకరించటం ఒక సానుకూల అంశమని ఆమె అభిప్రాయపడ్డారు.