Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్ము : జమ్ముకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 2జీ మొబైల్ డేటా సర్వీసు, ఇంటర్నెట్ సదుపాయాలకు సంబంధించి ఇప్పటికే కొనసాగుతున్న పాక్షిక ఆంక్షలను ఈ నెల 24 వరకూ పొడిగిస్తున్నట్టు అధికార యంత్రాంగం ఆదివారం ప్రకటించింది. 1,485 వైట్ లిస్టెట్ సైట్లను బ్రౌజ్ చేసేందుకు మాత్రమే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అవకాశం కల్పించారని, సోషల్ మీడియా అప్లికేషన్లను వినియోగించుకునేందుకు కాదని అధికారి ఒకరు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఈ ఆదేశాలు ఈనెల 16 నుంచి 24 వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు. జమ్ముకాశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5వ తేదీన రద్దు చేసిన తరువాత అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. అనంతరం దాదాపు ఐదు నెలల తర్వాత జనవరి 25న 2జీ ఇంటర్నెట్ సేవలను పున:ప్రారంభించిన విషయం తెలిసిందే.