Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజనీకాంత్పై డీఎంకే ఆగ్రహం
చెన్నై : తమిళనాడులో శుక్రవారం సీఏఏ నిరసనకారుల మీద పోలీసులు దమనకాండపై స్పందించకపోవడం పట్ల ప్రముఖనటుడు రజనీకాంత్పై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యపై ఆయన మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టింది. వివాదాస్పద సీఏఏతో ఏ ఒక్క ముస్లిమైనా నష్టపోతే వారికి తాను అండగా ఉంటానని చెప్పిన రజనీకాంత్.. ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ ట్వీట్ చేశారు. చెన్నైలోని వాషర్మెన్పేట్ ప్రాంతంలో శుక్రవారం ముస్లిం సంఘాలు చేపట్టిన సీఏఏ వ్యతిరేక నిరసన ర్యాలీపై పోలీసులు విరుచుపడి ఆందోళనకారులను లాఠీలతో చావబాదిన విషయం తెలిసిందే.