Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ కాన్ఫరెన్స్
జమ్మూ : మార్చిలో జరగనున్న జమ్ముకాశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నిర్ణయించుకుంది. తమ పార్టీ నాయకులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేందుకు రహదారుల దిగ్బంధనాన్ని ఉపసంహరించాలని కోరింది. ఈ మేరకు జమ్ముకాశ్మీర్ ఎన్నికల ప్రధానాధికారి శైలేంద్రకుమార్కు ఎన్సీ జాతీయ కార్యదర్శి రతన్ లాల్ గుప్తా ఆదివారం ఒక లేఖ రాశారు. ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తమ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్ధుల్లా, ఉపాధ్యక్షులు ఒమర్ అబ్ధుల్లా, ప్రధాన కార్యదర్శి అలీ మహ్మద్ సాగర్లను ప్రజాభద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలో ఉన్నారనీ, ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార ప్రక్రియ తమకు సాధ్యమయ్యేది కాదని లేఖలో పేర్కొన్నారు. బీజేపీ మినహా మిగతా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులను సృష్టించడమే లక్ష్యమైతే తాము చేసేదేమీ లేదని, అట్టడుగు స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యమైతే ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని తెలిపారు.