Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిషాలో దారుణ ఘటన
రౌర్కేలా (ఒడిషా) : భూ వివాదంతో సొంత అన్న కుటుంబాన్ని కడతేర్చిన అమానవీయ ఘటన ఆదివారం ఒడిషాలోని సుందర్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. బోనరు సబ్ డివిజినల్ పోలీస్ అధికారి (ఎస్డిపిఒ) అబకాశ్ రౌత్రరు తెలిపిన వివరాల ప్రకారం బోనరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్రపలి గ్రామంలో నివాసం ఉంటున్న అన్నదమ్ములు కలు ముందా, కందే ముందా (27)కు మధ్య భూమి గురించి వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వారి మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపేందుకు కందే ముందా భార్య సుమి ముందా(25) ప్రయత్నంచింది. దీంతో అక్కడి నుంచి నిష్క్రమించిన కలు ముందా కొంత సమయం తరువాత గొడ్డలితో అక్కడకు వచ్చి కందేపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. తరువాత కందే భార్య సుమిని, పిల్లలు మలాని (7), మారా (5)లను కూడా దారుణంగా నరికి పాశవికానికి పాల్పడ్డాడు. అనంతరం బోనరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే ఘటన స్థలానికి చేరిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.