Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23న భారత్ బంద్కు పిలుపు
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు, పదోన్నతులకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో భీం ఆర్మీ సభ్యులు ఆదివారం నిరసన ర్యాలీ చేపట్టారు. మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ సాగిన ఈ ర్యాలీకి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర ఆజాద్ నేతృత్వం వహించారు. ఈ తీర్పును నిరసిస్తూ ఈ నెల 23న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ తీర్పును రద్దు చేస్తూ కేంద్రం ఆర్డినెస్సు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రాజ్యాంగం కల్పిస్తున్న సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని భీం ఆర్మీ అధికార ప్రతినిధి హర్జిత్సింగ్ భట్టి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్రాలు కట్టుబడి ఉండవని, పదోన్నతుల్లో కోటా క్లెయిమ్ చేసేందుకు వాటికి ప్రాథమిక హక్కులేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడిన సంగతి విదితమే.