Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టికల్ 370, సీఏఏపై ప్రధాని మోడీ
వారణాసి : ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిర్ణయాలపై పునరాలోచించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా తమ ప్రభుత్వం వీటి విషయంలో వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ప్రధాని మోడీ వారణాసిలో మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ 'జమ్ముకాశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు అయినా, పౌరసత్వ సవరణ చట్టమైనా ఈ నిర్ణయాల కోసం దేశం అనేక ఏండ్ల నుంచి ఎదురుచూసింది' అని చెప్పారు. దేశ ప్రయోజనాలకు ఈ నిర్ణయాలు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. అందువల్లే అన్ని వైపులా నుంచి ఒత్తిళ్లు వస్తున్నా తాము ఈ నిర్ణయాలకు కట్టుబడి వున్నామని, ఇక ముందు కట్టుబడే వుంటామని మోడీ చెప్పారు.