Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్ షా ఇంటికి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- తిరిగి దీక్షా స్థలికి వెళ్లిన మహిళలు
న్యూఢిల్లీ : సీఏఏను రద్దు చేయాలనే డిమాండ్తో.. ఆ అంశంపై చర్చించడానికి కేంద్ర హౌం మంత్రి అమిత్ షా ఇంటికి మార్చ్గా వెళ్లిన షాహీన్బాగ్ నిరసనకారులను ఢిల్లీ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. కేంద్ర మంత్రిని కలుసుకోవడానికి వెళ్లిన ర్యాలీని నిలువరించారు. కేంద్ర మంత్రిని కలువడానికి అపాయింట్మెంట్తో రావాలని పోలీసు అధికారులు షాహీన్బాగ్ నిరసనకారులకు సూచించడంతో వారు తిరిగి తాము నిరసన చేస్తున్న దీక్షా వేదిక వద్దకు వెళ్లారు. అనుమతి వచ్చిన తర్వాతి తిరిగి అమిత్షాను కలుస్తామని షాహీన్బాగ్ మహిళా నిరసనకారులు తెలిపారు. నిరసనకారుల మార్చ్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. వీరి ర్యాలీని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. షాహీన్బాగ్ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కృష్ణమీనన్ మార్గ్లోని అమిత్షా ఇంటి చుట్టూ పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అమిత్ షా ఇంటికి తాము ఐదు వేల మందిమి వెళ్తామనీ, అనుమతినివ్వాలంటూ పోలీసులకు షాహీన్బాగ్ నిరసనకారులు శనివారం చేసుకున్న దరఖాస్తును పోలీసులు నిరాకరించిన విషయం తెలిసిందే.