Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
అహ్మదాబాద్: ప్రస్తుత సమాజంలో పాలకులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఈ నేపథ్యంలోనే హింసాత్మక కార్యకలాపాలు సైతం పెరుగుతున్నాయని అన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'రెండు ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం కుగ్రామమైంది. కానీ ఇప్పుడు మూడో యుద్ధ భయం వెన్నాడుతోంది. ఇది మరోరకంగా మన ముందుకు రాబోతోంది. యజమానులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు... ఇలా ప్రతి ఒక్కరూ నిరసనలకు దిగుతున్నారు' అని వ్యాఖ్యానించారు. ఈ నిరసనలు ప్రతి ఒక్కరూ అసంతప్తితో ఉన్నారని చెప్పకనే చెబుతున్నాయని అభిప్రాయపడ్డారు. 'మిల్లుల యజమానులు, అందులోని కార్మికులు సైతం నిరసనలకు దిగుతున్నారు. ఎవరిలోనూ సంతోషం లేదనడానికి ఇదే ఒక ఉదాహరణ. అభివృద్ధి ప్రపంచంలో అసంతృప్తి నెలకొన్నది. దీనిని తొలగించడానికీ, ప్రపంచానికి వివేకాన్ని అందించడానికి భారత్ ఒక 'గ్లోబల్ మార్కెట్' అనే భావన గురించి మాట్లాడాల్సిన అవసరముంది. వందేండ్ల పరిస్థితులను ఇప్పటి పరిస్థితులతో పోల్చితే.. ఇప్పుడా పరిస్థితులు లేవని' అన్నారు. అలాగే, సమాజ వనరులు అందరికీ అందుతున్నాయనేది సగం మాత్రమే నిజమని వెల్లడించారు.