Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలోని తలసరి తహసిల్ పంచాయత్ : సమితిలో సీపీఐ(ఎం) ఘనవిజయం
- 10కి 8 స్థానాలు కైవసం
పాల్గర్ (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు చెందిన తలసరి తహసిల్ పంచాయత్ సమితిలో ఎర్ర జెండా మరోసారి రెపరెపలాడింది. ఆ ప్రాంతంలో గత 58 సంవత్స రాలుగా విజయ ప్రస్థానాన్ని సీపీఐ(ఎం) కొనసాగిస్తోంది. ఈ పంచాయతీ సమితికి ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి శనివారం విడుదల చేసిన ఫలితాల్లో చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ స్థానాలను మరోసారి కైవసం చేసుకొని సత్తా చాటింది. చైర్పర్సన్గా నందకుమార్ హాదల్, వైస్చైర్మెన్గా రాజేస్ కార్పాడే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తలసరి తహసిల్ పంచాయతీ సమితిలో 10 మంది ఆదివాసీ సభ్యులు ఉన్నారు. గత నెల 7న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ పార్టీలను మట్టికరిపించి సీపీఐ(ఎం) తలసరి తహసిల్ పరిధిలోని పదికి ఎనిమిది పంచాయతీ స్థానాల్లో, ఐదుకి నాలుగు జిల్లా పరిషద్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. పాల్గర్ జిల్లాలో సీపీఐ(ఎం) ఆరు జెడ్పీ, 12 పీఎస్ స్థానాలతో మొత్తం మీద 18 సీట్లలో ఎర్రజెండా ఎగురవేసింది. 2015 ఎన్నికల కంటే ఈసారి 3 అధిక స్థానాలను గెలుచుకుంది. తలసరి తహసిల్ పంచాయత్ పరిధిలో సీపీఐ(ఎం)కు ఇంతటి ఘనవిజయం కొత్త కాదు. 1962 నుంచి అంటే 58 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఆ పార్టీ తన విజయపరంపరను కొనసాగిస్తోంది. 2019, అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గర్ జిల్లా దహాను నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్ధి వినోద్ నిఖోలే బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించారు. ఈ దహాను నియో జకవర్గ పరిధిలో మొత్తం తలసారి తహసీల్తోపాటు అనేక ప్రాంతాలు ఉం టాయి. దహాను స్థానాన్ని అంతకు ముందు జవహర్ అని పిలిచేవారు. ఈ నియో జకవర్గానికి 1978 నుంచి జరిగిన 10 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) తొమ్మిది సార్లు విజయం సాధించడం గమనార్హం.