Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా తప్పనిసరిగా ఇవ్వాల్సిం దేనని సుప్రీంకోర్టు సోమవా రం కీలకతీర్పు వెలువరిం చింది. అంతేగాక, మహిళల సామ ర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనా ధోరణి మార్చు కోవాలని, వారి హక్కులకు శారీరక లక్షణాలతో సంబంధం పెట్టడం ఎంత మాత్రమూ సరికాదని ధర్మాస నం వ్యాఖ్యానించింది. మహిళలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వకుండా వారిపై వివక్ష చూపడం సరికాదని తెలిపింది. కమాండ్ విధులకు మహిళా అధికారులు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్ కల్పించాలని సుప్రీం ఆదేశించింది. సర్వీసుతో సంబంధం లేకుండా ఈ శాశ్వత కమిషన్ మహిళా అధికారులందరికీ వర్తిస్తుందని వెల్లడించింది.
భారత ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పిస్తూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్మీలో చాలామం ది గ్రామీణ ప్రాం తాల నుంచి వచ్చి న జవాన్లు ఉన్నారని, కమాండ్ హోదాలో మహిళా అధికారులను అంగీకరిం చేందుకు వారు మానసికంగా సిద్ధంగా లేరని ఇటీవల సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో కేంద్రం పేర్కొన్నది.ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సాయుధ బలగాల్లో లింగ వివక్షను తొలగించాలంటే ప్రభుత్వ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని స్పష్టం చేసింది. మహిళా అధికారులను కమాండ్ పోస్టులకు నిషేధించడం పూర్తిగా నిర్హేతుకమైనదని, సమానత్వ హక్కులకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. కమాండ్ పోస్టులకు మహిళా అధికారులు అర్హులేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.
కేంద్రం వాదనపై ఆగ్రహం
మహిళల శారీరక లక్షణాలకు, వారి హక్కులకు ముడిపెడుతూ కమాండ్ పోస్టు లకు వారు అర్హులు కాదని కేంద్రం తన వాదనను సుప్రీంకోర్టు ముందుంచింది. ఈ నివేదికపై న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితమనే ఆలోచనా ధోరణి మారాలని హితవు పలికింది. శారీరక పరిమితులు, సామాజిక నిబంధన ల కారణంగా మహిళలకు అవకాశం కల్పించడం లేదన్న కేంద్ర వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రభుత్వం ఇలా చెప్పటం ఆందోళనకరమని, దీనిని తాము ఎప్పటికీ అంగీకరించబోమని తెలిపింది.