Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న అయిషీ ఘోష్
న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) విద్యార్థులు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళ నకు దిగారు. షార్జీల్ ఇమామ్తో పాటు దేశద్రోహం, జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసులు మోపబడి, అరెస్టయిన డాక్టర్ కఫీల్ఖాన్ను విడుదల చేయాలనీ వారు డిమాండ్ చేశారు. జేఎన్యూ ఎస్యూ ప్రెసిడెంట్ అయిషీఘోష్, వైస్ ప్రెసిడెంట్ సాకేత్ మూన్ల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ''ప్రస్తుతం దేశంలో ద్వేషపూరిత ప్రసం గాలతో వేడుకలు చేసుకుంటున్నారు. బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు 'నిరసనారులను కాల్చిపాడే యాలి' వంటి ప్రసంగాలు చేసినా.. వారిపై ఎలాంటి చర్యలూ ఉండవు'' అని అయిషీ ఘోశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నార్సీ, సీఏఏలు పేదలుకు వ్యతతిరేకం, మతతత్వంతో కూడుకున్నవి అని, అఖిల్ గొగోరు, షార్జీల్ ఇమామ్, కఫీల్ఖాన్లను విడుదల చేయాలనే రాతలతో కూడిన ప్లకార్డులను ఈ సందర్భంగా నిరసనకారులు ప్రదర్శించారు.