Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ఆర్థిక పరిస్థితిపై మొద్దు నిద్రలో మోడీ సర్కార్ : ప్రకాశ్ కరత్
- ప్రజావ్యతిరేక బడ్జెట్ పై జంతర్ మంతర్లో వామపక్షాల భారీ ధర్నా
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని పేద ప్రజానీకాన్ని కొట్టి పెట్టుబడిదారులకు పెట్టడమేంటని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న తరుణంలో మోడీ సర్కారు మొద్దు నిద్ర సరికాదన్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన బడ్జెట్లో ఒక్క అంశం కూడా పేద ప్రజానీకాన్ని ఆదుకునేలా లేదని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు. ఇది ఒక ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని అభివర్ణించారు. కేంద్ర బడ్జెట్లో అన్నివర్గాల ప్రజానీకం అన్యాయానికి గురైందని మంగళవారం వామపక్ష పార్టీలు సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని మండిహౌస్ నుంచి జంతర్మంతర్ వరకు సీపీఐ(ఎం) ఢిల్లీ కమిటీ నేత ృత్వంలో ఇతర లెఫ్ట్ పార్టీల నేతలు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వామపక్ష కార్యకర్తలు, సామాజివేత్తలు, విద్యార్థులు, యువతీ యువకులు, రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జన్ విరోధి... నరేంద్ర మోడీ, కిసాన్ బచావో... దేశ్ బచావో అంటూ నినాదాలతో హెరెత్తించారు. భారీ ర్యాలీగా వెళ్లి జంతర్మంతర్ వద్ద ఆందోళన నిర్వహించారు. సీపీఐ(ఎం) సీనియర్ నేత ప్రకాశ్ కరత్ ఈ ఆందోళన కార్యక్రమంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని రాజధా నుల్లో బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నా యన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజానీకానికి ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వలేద న్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో సుదీర్ఘంగా ప్రసంగించి, రికార్డు సృష్టించారన్నారు. కానీ అందులో దేశం ముందున్న ఆర్థికమాంద్యం గురించి ఒక్కమాట మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. పైగా బడ్జెట్ వేదికగా అందులో తీసుకునే చర్యల గురించి చెప్పిన అంశాలు ఆర్థిక మాం ద్యం, నిరుద్యోగ రేటు మరింత పెరగనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇతోధికం పేరుతో గతేడాది ఇదే నెలలో మన దేశం లోని పెద్ద కంపెనీలకు ఆర్థిక మంత్రి సీతారామన్ పెద్ద బహు మానం ఇచ్చారని గుర్తుచేశారు. కార్పొరేట్ల పన్నుల్లో చాలా రాయితీ లిచ్చారన్నారు. సుమారు రూ. 1 లక్షా 45 వేల కోట్ల రుణాల్ని మోడీ సర్కార్ మాఫీ చేసిందని వివరించారు. ఈ బడ్జెట్లో ఏకంగా ఎల్ఐసీ అమ్మేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ముందు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అమ్మడానికి నిర్ణయించారన్నారు. లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ సంస్థలను అమ్మి లోటును భర్తీ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదన్నారు. ప్రస్తుతం దేశ ఆదాయం తక్కువ గా ఉన్నదనీ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఉపయోగపడే డబ్బులను రూ. 10 వేల కోట్లను తగ్గించి పరిస్థితిని మరింత దిగజార్చేందుకు యత్నించారన్నారు. ఉపాధి హామీ పథకం, ఆహార సబ్సిడీ, ఫుడ్ కార్పొరేషన్లో మొత్తం రూ. 70 వేల కోట్ల తగ్గింపు చేశారన్నారు. వ్యవసాయ రంగానికి రూ. 30 వేల కోట్లు తగ్గించార న్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పిల్లలు సంక్షేమ పథకాలకు కేటాయించిన డబ్బుల్లో కోత విధించారన్నారు. కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేసిన రూ. 1 లక్షా 45 వేల కోట్ల రుణాల్ని రైతులు సామాన్యుల నుంచి భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దేశ ప్రజానీకంపై రోజురోజుకూ భారం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇంకా అమలు కాలేదన్నారు. అయితే, ఆలోపే ప్రభుత్వ సంస్థలను అమ్మడాన్ని ఆపాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. నిరుద్యోగులకు కచ్చితంగా భృతి ఇవ్వాలని డిమాం డ్ చేశారు. కనీస వేతనం రూ. 21 వేలు నెలకు ఇవ్వాలని కోరారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ.... ఆర్థిక సంక్షోభం తరుణంలో ప్రభుత్వం పేదలకు కేంద్రం అండగా నిలవా ల్సి ఉందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తన పెట్టుబడిదా రు అనుకూల నిర్ణయాలతో పేదలకు మరింత ఇబ్బందికర పరిస్థితి సృష్టించిందన్నారు. పేద ప్రజానీకం ఆందోళనను ప్రభుత్వం ఏమా త్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూత్వ రాజకీ యాలే ఆలంబనగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుండటం బాధా కరమన్నారు. సీపీఐ(ఎం) నాయకులు హన్నన్ మొల్లా మాట్లాడు తూ... రైతుల పంటకు మద్ధతు ధర ఇవ్వాలన్నారు. సంక్షోభం తలెత్తిన తరుణంలో అన్నదాతల అప్పుల్ని మాఫీ చేయాలన్నారు. లేనిపక్షంలో రైతులతో దేశవ్యాప్తంగా భారీ ఆందోళన నిర్వహిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఢిల్లీ కమిటీ నేతలు నత్తూ ప్రసాద్, సీపీఐ(ఎంఎల్) ఢిల్లీ కమిటీ కార్యదర్శి రవి రారు పాల్గొన్నారు.