Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
నమామి గంగ తరహాలో మూసీ నది పరిరక్షణ, ప్రక్షాళన చేపట్టేల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని టీ కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిను కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ నివాసంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య ను కలిసి, వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు తాగునీటిని అందించిన మూసీ నది..ఇపుడు విష వ్యర్థాలకు కాసారంగా మారిందని తెలిపారు.