Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ కార్యకర్తను వెనక్కి పంపిన గుజరాత్ పోలీసులు
గాంధీనగర్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన వెళ్లే మార్గంలో మురికివాడలో నివాసముంటున్న నిరుపేదలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడంపై నిరసన తెలపడాన్నీ బీజేపీ ప్రభుత్వం సహించడం లేదు. ఇదే విషయమై బాధితులకు అండగా.. కేరళకు చెందిన జ్వాలా ఫౌండేషన్కు చెందిన అస్వతి జ్వాల అనే సామాజిక కార్యకర్త సోమవారం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నది. ఇందిరా బ్రిడ్డి కింద ఉండే శరణ్యవాస్ మురికివాడలో 'ఇది మన కొత్త ఇండియా. మన వాస్తవ భారతదేశం. మన భారత్ను దాచొద్దు. మన ప్రజలను గోడ చాటున ఉంచడం రాజ్యాంగ విరుద్ధం' అనే ప్లకార్డు పట్టుకుని నిరసన తెలుపుతున్నది.దీంతో మంగళవారం సాయంత్రం 7 గంటలకు అక్కడకు వచ్చిన శారదానగర్ పోలీసులు.. నిరసనలకు అనుమతి లేదనీ, అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో అనుమతి కోసం ఆమె స్థానిక పోలీస్స్టేషన్ను సంప్రదిస్తే .. ఖాకీలు అందుకు ఒప్పుకోలేదు. అంతేగాక జ్వాలను తన స్వంత రాష్ట్రం కేరళకు పంపించారు.దీనిపై జ్వాల స్పందిస్తూ... నిరుపేదలను ఇక్కడి నుంచి వెళ్లగొట్టడం తనను బాధించిందనీ, అందుకే నిరసన తెలిపాలనని చెప్పింది. ఈ హక్కును కూడా పోలీసులు కాలరాస్తున్నారని తెలిపింది. ఇదే విషయమై స్థానికుడొకరు మాట్లాడుతూ.. 'ఆమె రెండ్రోజులుగా తిండి తినకుండా మా కోసం వచ్చి నిరసన తెలుపుతుంది. మా ఊరు కాకున్నా మాకు మద్దతుగా వచ్చింది' అని తెలిపాడు.
పాన్ షాపులు బంద్...
రోడ్ల వెంబడి ఉండేవాళ్లకు ఐడీ కార్డులు
ట్రంప్ పర్యటన సందర్భంగా గుజరాత్లో పేదరికాన్ని దాస్తున్న మోడీ సర్కారు.. రోడ్ల వెంబడి ఉండే పాన్షాపులను బంద్ చేయించినట్టు తెలుస్తున్నది. పాన్లు కొన్నవాళ్లు వాటిని తిని రోడ్లపై ఉమ్మివేస్తారనీ, దాంతో తాము చేస్తున్న సుందరీకరణ పాడవుతుందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఓ అధికారి తెలిపారు. అంతేగాక ట్రంప్-మోడీ ర్యాలీలో రోడ్ల వెంబడి నిల్చునే వారికి విజరు రూపానీ సర్కారు గుర్తింపు కార్డులు అందజేయనున్నది. అవి ఉన్నవాళ్లే రహదారుల చుట్టూ నిల్చోవాలే తప్ప మిగిలినవారిని అనుమతించరు.
యమునలో దుర్గందం వెదజల్లకుండా...
రెండ్రోజుల పర్యటన సందర్భంగా ట్రంప్ తాజ్మహల్ను సరదర్శించే అవకాశం ఉండటంతో ఉత్తరప్రదేశ్ కూడా గుజరాత్ వలే సిద్ధమవుతున్నది. తాజ్ చుట్టూ, పక్కన ప్రవహించే యమునా నదిలో దుర్గందం తీవ్రస్థాయిలో వెదజల్లుతుండటంతో.. ఆ నదిలోకి నీటిని వదిలారు. బులంద్షహర్లో ఉన్న గంగానహర్ నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీళ్లు శుక్రవారం నాటికి ఆగ్రాకు చేరుకునే అవకాశం ఉన్నది. ట్రంప్ పర్యటన ఇంకా ఖరారు కాకున్నా యూపీ ఇరిగేషన్ అధికారులు మాత్రం నీటిని వదలడం గమనార్హం.