Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్ పర్యటనకు ముందు కేంద్రం కీలకనిర్ణయం
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేవారంలో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా నుంచి ఎంహెచ్-60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తున్నది. 2.5 బిలియన్ డాలర్ల (రూ.17894 కోట్లు) వ్యయంతో అమెరికా నుంచి 24 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు. ఈ హెలికాప్టర్లను భారత నౌకాదళం కోసం కొనుగోలు చేయనున్నారు.
హౌడీ మోడీ..లాంటిదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో కలిసి భారత పర్యటనకు వస్తున్నారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. అహ్మదాబాద్లో జరగనున్న 'నమస్తే ట్రంప్' కార్యక్రమం కూడా అమెరికాలో గత ఏడాది హ్యూస్టన్ నగరంలో నిర్వహించిన 'హౌడీ మోడీ' లాంటిదేనన్నారు. ట్రంప్ భారత పర్యటన వివరాలను తెలియజేస్తూ, ఫిబ్రవరి 25న భారత ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య విస్త్రతస్థాయి చర్చలు జరగనున్నాయని ష్రింగ్లా తెలిపారు. రక్షణ, వాణిజ్యం,ఉగ్రవాదం, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై చర్చలుంటాయని అన్నారు.