Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : యోగి ఆదిత్యానాథ్ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్లో మరో బీజేపీ ఎమ్మెల్యేపై లైంగికదాడి కేసు నమోదయ్యింది. బధోరు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠితో పాటు మరో ఆరుగురు కలిసి తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీ సుల వివరాల ప్రకారం.. బధోరుకు చెందిన ఓ మహిళ 2007లో భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నది. ఈ క్రమంలో సాయం కోసం త్రిపాఠి మేనల్లుడిని కలిసి అర్థించగా.. అతడు ఒకరోజు బధోరులోని ఓ హౌటల్లోకి తీసుకెళ్లాడు. 2017లో ఫిబ్రవరిలో త్రిపాఠితో పాటు మరో ఆరుగురు నెలరోజులు పాటు ఆమెను లైంగికంగా హింసించారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే ఆమెను బెదిరించిన ఎమ్మెల్యే ఆ మహిళ గర్భాన్ని తీసేయించారు. దీనిపై మూడేండ్ల తర్వాత ఆ మహిళ పోలీ సులకు ఫిర్యాదు చేయగా.. అసిస్టెంట్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎఎస్పీ) స్థాయి వ్యక్తితో విచారణ చేయించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదైంది. యూపీలో మహిళలపై బీజే పీ ఎమ్మెల్యేలు లైంగికదాడికి పాల్పడటం ఇదే ప్రథమం కాదు. గతంలో ఉన్నావో ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద కూడా ఈ జాబితాలో ఉన్నారు. కుల్దీప్ దోషిగా తేలి శిక్ష అనుభవిస్తుం డగా.. చిన్మయానంద కేసు విచారణ జరుగుతున్న విషయం విదితమే.