Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎం కేర్స్ ఫండ్కు రూ.151 కోట్ల వితరణ
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి తమ వంతు సాయంగా 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులు.. ఒక రోజు వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి విరాళంగా అందిచనున్నారు. ఇందుకు గానూ రూ.151 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఫండ్ (పీఎం కేర్స్)కు పంపనున్నట్టు రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆదివారం వెల్లడించారు. ఇదే విషయమై గోయల్ స్పందిస్తూ.. 'ప్రధాని మోడీ పిలుపు మేరకు నేను, రైల్వే సహాయ మంత్రి అంగడి సురేష్ మా నెల జీతాన్ని విరాళం ఇవ్వనున్నాం, అదేవిధంగా 13 లక్షల రైల్వే ఉద్యోగులు వారి ఒక రోజు వేతనాన్ని పిఎం-కేర్స్కు ఇవ్వనున్నారు' అని ట్వీట్ చేశారు. విరాళాలు అందజేసిన వారందరికీ ఆయన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.