Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ప్రశంసలు
న్యూఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్ కారణంగా అతలాకుతలం గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ కరోనా వ్యాప్తి కట్టడికి నడుం బిగించాడు. తన సొంత రాష్ట్రమైన హర్యానాలో పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఖాకీ దుస్తులు ధరించి వీధుల్లో డ్యూటీ చేస్తున్న జోగిందర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ఐసిసి స్పందిస్తూ అతడిని రియల్ హీరోగా అభివర్ణించింది. ప్రపంచమంతా కరోనా సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో జోగిందర్ శర్మ తనవంతు కృషి చేస్తున్నాడని ప్రశంసించింది. అతని ఫోటోను ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. జోగిందర్ను అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. 2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ అద్భుతమైన బౌలింగ్తో భారత్ను గెలిపించాడు. దీంతో అతను ఓవర్నైట్ స్టార్గా మారిపో యాడు. జోగిందర్ 2018లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్లో అందించిన సేవలకుగానూ హర్యానా ప్రభుత్వం అతన్ని డిఎస్పి (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమించిన విషయం తెలిసిందే.