Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : 'స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న మా బంధువు డాక్టర్ మహ్మద్ అలీ మట్టూ మరణించారు. దయచేసి ప్రస్తుతం అమల్లో వున్న నిబంధనలనుసరించి ఆయన ఇంటివద్ద లేదా శ్మశాన వాటిక వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడరాదని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా' అఁ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మట్టూ మృతికి సంతాపం తెలుపుతూ ప్రధాని మోడీ సోమవారం ఉదయం సంతాప సందేశం పంపారు. ఇంతటి విషాద సమయంలో కూడా ఎవరూ సమూహాలుగా రావద్దంటూ ఒమర్ కోరడం అభినందించదగిన విషయమని పేర్కొన్నారు. మోడీ పంపిన సంతాప సందేశానికి ఒమర్ కృతజ్ఞతలు తెలిపారు.