Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూ ఇండియా అస్యురెన్స్ అంగీకారం
న్యూఢిల్లీ : కరోనా వైరస్పై ముందుండి పోరాటం చేస్తున్న ఆరోగ్య సంరక్షకులకు రూ.50 లక్షల బీమా కల్పించేందుకు న్యూ ఇండియా అస్యురెన్స్ అంగీకరించింది. ' ఈ నెల 26న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్టుగా.. దేశ వ్యాప్తంగా 22.12 లక్షల మంది ఆరోగ్య సంరక్షకులకు రూ.50 లక్షల రక్షణ బీమా కల్పించడానికి న్యూ ఇండియా అస్యురెన్స్ మార్గదర్శకాలను జారీ చేసింది' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పేర్కొంది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, శానిటేషన్ వర్కర్లు, మరికొందరికి ఈ బీమా మూడు నెలల పాటు వర్తిస్తుందని సీతారామన్ తెలిపారు.