Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉచితంగా ప్లాన్ల గడువు పొడిగింపు
న్యూఢిల్లీ : ప్రయివేటు టెల్కోలతో పోల్చితే చౌక ప్లాన్లు, వినియోగదారుల పట్ల ఉదారంగా ఉండే బీఎస్ఎన్ఎల్ మరోమారు తన సేవా దృక్పదాన్ని నిరూపించుకుంది. కరోనా వేళ దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తమ ప్రీపెయిడ్ వినియోగదారుల ప్లాన్ల వాలిడిటీ గడువును పెంచడమే కాకుండా రూ.10 విలువ గల అదనపు టాక్టైం అందిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. మార్చి 20 తర్వాత వ్యాలిడిటీ అయిపోయిన మొబైల్ వినియోగదారులకు ఏప్రిల్ 20 వరకు ఉచితంగా వ్యాలిడిటీని పొడిగించనున్నట్టు ప్రకటించింది. అలాగే లాక్డౌన్ కాలంలో వినియోగదారుల బ్యాలెన్స్ సున్నాకు చేరితే.. వారికి రూ.10 రూపాయల ఉచిత టాక్టైమ్ అందించనున్నట్టు వెల్లడించింది. ఈ కష్ట సమయంలో తమ సంస్థ వినియోగదారులకు మద్దతుగా నిలుస్తుందని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వర్ తెలిపారు. వినియోగదారు రీచార్జీ చేసుకోవడానికి డిజిటల్ పద్ధతులు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.