Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ : దేశంలో లాక్డౌన్ అమలవుతున్నా బ్యాంకింగ్ కార్యకలాపాలు సాఫీగానే సాగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులూ తెరిచి ఉన్నాయనీ, ఏటీఎం కేంద్రాలు పని చేస్తున్నాయన్నారు. కరోనా నేపథ్యంలో బ్యాంకులు తమ శాఖలను మూసివేస్తున్నాయనే ప్రచారం నేపథ్యంలో మంత్రి ఈ అంశంపై సోమవారం ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారన్నారు. అవసరమైన చోట శానిటైజర్లను ఏర్పాటు చేశారన్నారు. అన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచి ఉంచి, ఏటీఎంలను నగదుతో నింపుతున్నాయన్నారు