Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ వాసులు ఢిల్లీలో మతప్రార్థనలకు వెళ్లి..
న్యూఢిల్లీ : ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నట్టు గుర్తించారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణిం చారు. ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో, ఒకరు అపోలో.. మరొకరు గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోయారు. నిజామా బాద్ , గద్వాల్లో ఒక్కొక్కరు మరణించారు. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉన్నదని ప్రభుత్వం భావి స్తున్నది. ఇప్పటికే అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సనందిస్తున్నారు.