Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేరళలోని కొట్టాయం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సంతోషకరమైన సమాచారం వచ్చింది. రాష్ట్రంలోని ప్రజలకు అందే వైద్య సదుపాయాల విషయంలో ఈ ఆస్పత్రికి మెరుగైన ఘన చరిత్ర ఉంది. కరోనా బారిన పడిన పథనంమిట్టకు చెందిన ఇద్దరు వృద్ధులు...చికిత్సతో నయమై విజయవంతంగా బయటకు వచ్చారు. గతనెల 29న ఇటలీ నుంచి తమ కుమారుడు, కోడలు నుంచి వృద్ధ దంపతులైన థామస్(93), మరియమ్మ(88)లకు కరోనా వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చేరిన వారికి వైద్యులు చికిత్స అందించారు. కరోనాకు సంబంధించి 60 ఏండ్లస్త్ర పైబడిన వృద్ధులు హైరిస్క్ జోన్లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా వార్త ప్రాధాన్యత సంతరించుకున్నది. వైరస్ సోకిన మొదట్లో వారి పరిస్థితి విషమంగా ఉన్నది. థామస్కు న్యుమోనియాతో పాటు గుండెపోటు రావడంతో వెంటిలేటర్పై ఉంచారు. మరియమ్మకు ఐసీయూలో వైద్యం అందించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె.శైలజ ఆధ్వర్యంలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది వారికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిని మంత్రి అభినందించారు.