Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశమంతా లాక్డౌన్ అమల్లో ఉండటంతో వలస కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకోవడంలో చేదు అనుభవాలు ఎదుర్కొం టున్నారు. దూరప్రాంతాల నుంచి ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాకు చేరుకున్న వలస కూలీలపై అధికారులు రసాయన ద్రావణాన్ని (కెమికల్స్ స్ప్రే) వెదజల్లారు. పిల్లలు, పెద్దలు..కండ్లు మూసుకోండంటూ ఒక చోట రోడ్డుపై కూర్చోబెట్టి అందరిపై ద్రావణాన్ని వెదజల్లారు. వైరస్ సోకకుండా వీధులు, భవనాలపై జల్లాల్సిన ద్రావణాన్ని ఇలా వలస కూలీలపై ప్రయోగించటం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో రాజకీయ ప్రముఖులు ఈ చర్యను తప్పుపడుతున్నారు. ఈ ఘటనపై బరేలి జిల్లా మెజి స్ట్రేట్ స్పందిం చారు. ''ఈ వీడియోపై దర్యాప్తు జరు పుతున్నారు. సీఎంవో పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ బిగ్రేడ్ వారికి బస్సులను శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చాం. కానీ వారు అత్యుత్సాహంతో వలసకూలీల పైనా ద్రావణాన్ని ప్రయోగించారు. బాధ్యులైన అధికా రులపై చర్యలు తీసుకుంటున్నా''మని ట్విట్టర్లో వెల్లడించారు. అయితే జిల్లా యంత్రాంగం అధికారి ఒకరు మాట్లాడుతూ..''క్లోరిన్ను నీటితో కలిసి స్ప్రే చేస్తున్న తరుణంలో, వలస కూలీలు భారీగా తమ సొంత ప్రాంతాలకు తిరిగి వస్తుండటంతో, ప్రతి ఒక్కరినీ పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో అలా చేశామ''మని చెప్పుకొచ్చారు.
ఇది క్రూరత్వమన్న పలు పార్టీలు
ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి స్పందించారు. వలస కూలీలపై ఇలా స్ప్రే చేయడం అన్యాయమని, క్రూరత్వానికి ఉదాహరణ అని మాయవతి అన్నారు. ''ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా వైరస్పై అందరం కలిసి పోరాడుతున్నాం. దయచేసి ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడవద్దు. కూలీలు ఇప్పటికే చాలా నష్టపోయారు. వారిపై రసాయనాలను పిచికారీ చేయవద్దు. ఇది వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది'' అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
ఆ అధికారులపై చర్యలు తీసుకుంటాం : కేంద్రం
బరేలి జిల్లాలో వలస కూలీల పట్ల అమానుషంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ ఘటనకు కారణమైనవారిపై తప్పక చర్యలుంటా యని స్పష్టం చేసింది. కొందరు ఉద్యోగుల తెలివి తక్కువతనంతో అతిగా ప్రవర్తించారని జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టంచేశారు.