Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ప్రకటన
న్యూఢిల్లీ : డ్రైవింగ్లైసెన్స్ల రెన్యువల్ను, వాహనాల రిజిస్ట్రేషన్ల గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా సరుకుల రవాణాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాహనాల చట్టం ప్రకారం.. ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్లతో పాటు అవసరమైన ఇతర పత్రాలకు గడువును కూడా జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ రవాణాశాఖ కార్యాలయాలను మూసివేయడంతో.. అత్యవసర సేవలను అందించే వ్యక్తులు, రవాణాదారులు, పలు సంస్థలు వేధింపులకు గురికాకుండా, ఇబ్బందులను ఎదుర్కోకుండా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.