Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ డిమాండ్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని అఖిల భారత రోడ్డు రవాణా వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్య్యూఎఫ్) ప్రధాన కార్యదర్శి కె.కె దివాకరన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి తగ్గాయనీ, బారెల్ ధర 18 ఏళ్లలో కనిష్ట స్థాయికి 20 డాలర్లకు తగ్గిందని పేర్కొన్నారు. పది రోజుల క్రితమే బారెల్ ధర 30 డాలర్లకు తగ్గిందనీ, అది కాస్తా ఇప్పుడు 20 డాలర్లకు తగ్గిందని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం రోడ్డు సెస్ను పెద్ద ఎత్తున పెంచడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దానికి తోడు, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత పెంచుకునేందుకు అనుమతించిందని పేర్కొన్నారు. ఇది ఎంతో ప్రమాదకరమైన మహమ్మా రి కరోనాతో బాధపడుతున్న ప్రజలపై క్రూరమైన దాడి తప్ప మరొకటి కాదని విమర్శించారు. ప్రస్తుతం మళ్లీ ముడి చమురు ధరలు మరింత తగ్గాయనీ, ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీిజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన సుంకాన్ని తగ్గించాలని, అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ తదితర ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కోరుతోందని పేర్కొన్నారు.