Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: కరోనా ఉద్ధతి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి ఏ ఒక్క వ్యక్తినీ తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు, రైళ్ల రాకపోకలతో పాటు రహదారి మార్గంలో కూడా రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది.