Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 కేజీల బాంబు స్వాధీనం
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లోని పుల్వామాలో భద్రతాదళాల ముందు జాగ్రత్త కారణంగా పెద్ద కారుబాంబు ప్రమాదం తప్పింది. గత ఏడాది పుల్వామాలో ఆత్మాహుతిదళ సభ్యుడు కారుబాంబుతో విధ్వంసం సృష్టించినట్లే ఇప్పుడు కూడా చేయాలని చేసిన ప్రయత్నం విఫలమయింది. 20 కేజీల బరువున్న బాంబు కల్గిన కారును భద్రతా దళాలు గుర్తించి బాంబును డిప్యూజ్ చేశాయి. కారుబాంబు దాడి జరిగే అవకాశముందని ముందే భద్రతా దళాలకు సమాచారం అందండంతో మంగళవారం నుండి ఎప్పుడు బాంబుతో ఉన్న కారు వస్తుందా అని ఎదురుచూశాయి. అంతటా భద్రత కట్టుదిట్టం చేశాయి. 20 కేజీల బాంబు కల్గిన తెల్ల హ్యుందయి శాంత్రో కారు నకిలీ రిజిస్ట్రేసన్ నెంబర్తో చెక్పోస్ట్ వద్ద రాగానే తనిఖీ చేయబోగా ఆపకుండా కారును ముందుకు దూకించాడు. వెంటనే భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో డ్రైవర్ దిగి పారిపోయాడు. బాంబు కల్గిన కారును స్వాధీనం చేసుకున్న భద్రతాదళాలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించి బాంబును కారును ధ్వంసం చేశాయి.
ఈ క్రమంలో పక్కనే ఉన్న కొన్ని ఇళ్లకు కొంత నష్టం జరిగింది. ఆర్మీ, పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డిజిపి దిల్బాగ్ సింగ్ తెలిపారు. గత ఏడాది సిఆర్పిఎఫ్ కాన్వారుపై ఫిబ్రవరిలో జరిగిన బాంబుదాడిలో 40 మంది భద్రతా దళాలు చనిపోయారు. ఆ తర్వాత భారత వాయుసేన జైషీ మహ్మమ్మద్ ఉగ్రవాద సంస్థ శిక్షాణా శిబిరంపై దాడి చేసి నాశనం చేసింది.