Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీిఎస్యూల ప్రయివేటీకరణ వద్దు
- ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘం డిమాండ్
న్యూఢిల్లీ : కార్మిక చట్టాల్లో మార్పులు ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆరెస్సెస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఫ్ు (బీఎంఎస్) డిమాండ్ చేసింది. కార్మిక కార్మిక చట్టాలను రద్దు చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడం వంటి ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. కార్మిక వ్యతిరేక చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు సికె సాజీ నారాయణన్, ప్రధాన కార్యదర్శి విర్జేశ్ ఉపాధ్యాయ తెలిపారు. ఇటీవలి బీఎంఎస్ జాతీయ కార్యాలయ నేతలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, బీఎంఎస్ సమాఖ్య ప్రధాన కార్యదర్శులతో జరిగిన వీడియో సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా వలస కార్మికులు దారుణమైన పరిస్థితి, భారీ ఉద్యోగాలను తీసివేయడం, వేతనాలు ఇవ్వడానికి నిరాకరించడం, ఏకపక్షంగా కార్మిక చట్టాలను నిలిపివేయడం, పని గంటలను 12 గంటలకు పెంచడం, హద్దులేని ప్రయివేటీకరణపై వచ్చే నెలలో ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. రక్షణ ఉత్పత్తి, బొగ్గుతో సహా కీలక రంగాలను ప్రయివేటీకరించడానికి అనుమతించిన ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు పని గంటలను పెంచే ఉత్తర్వులను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించినప్పటికీ తాము పోరాటం కొనసాగిస్తామని బీఎంఎస్ నాయకులు తెలిపారు. కార్మిక చట్టాలను నిలిపివేసేందుకు తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక ఆర్డినెన్స్ను మూడు రాష్ట్రాలు ఉపసంహరించుకోలేదని, 15 రాష్ట్ర ప్రభుత్వాలు పని సమాయాన్ని పెంచినందుకు నిర్ణయించాయని విర్జేశ్ ఉపాధ్యాయ తెలిపారు.