Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలు ఉచిత భోజన సదుపాయం కల్పించాలి : వలసకూలీల అంశంపై సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : వలసకూలీల ప్రయాణానికి సంబంధించి ఎలాంటి రవాణా చార్జీలు వసూలు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. వలసకూలీల రవాణా కోసం రిజిస్ట్రేషన్, భోజన సదుపాయం కల్పించ డం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టంచేసింది. వలస కూలీలను ఆదుకునేం దుకు కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేపట్టిన చర్యల్లోని లోపాలు తమ దృష్టికి వచ్చాయని, సరళతరమైన, స్పష్టమైన వైఖరి లేకపోవటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. లాక్డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న వలసకూలీల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తాజాగా కొన్ని మార్గదర్శకాల్ని విడుదలచేసింది. వలస కూలీల అంశాన్ని సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రాథమిక నివేదికను కోర్టుకు సమర్పించారు. అన్ని రాష్ట్రాలు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కె.కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. వలస కూలీల రవాణా కోసం రిజిస్ట్రేషన్, భోజన సదుపాయం, రైళ్ల కోసం ఎదురుచూపులు చూడటం వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వారి కష్టాలు చూసి కొన్ని మధ్యంతర ఆదేశాలు ఇస్తున్నామని తెలిపింది. వలస కూలీలను గుర్తించడం, వారికి సదుపాయాలు కల్పించటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ధర్మాసనం తెలిపింది. తుదపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.