Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏప్రిల్లో (-) 60శాతం క్షీణత : ఎస్బీఐ
ముంబయి : దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల పారిశ్రామిక తయారీ రంగం ప్రతికూల వృద్ధిని నమోదు చేయనుందని ఎస్బీఐ ఒక రిపోర్టులో అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో భారత తయారీ రంగం ఏకంగా మైనస్ 50 నుంచి 60 శాతం మేర క్షీణించే అవకాశాలున్నాయని విశ్లేషించింది. అయితే మే మాసంలో కొంత పుంజుకుని మైనస్ 30 నుంచి మైనస్ 35 శాతం మధ్య నమోదు కావొచ్చని తెలిపింది. ఎస్బీఐ రిపోర్టు ప్రకారం.. తయారీ రంగం భారీగా క్షీణించడంతో పారిశ్రామికోత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుందని.. అంతిమంగా ఇది జీడీపీపై ఒత్తిడి పెంచనుంది. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పారిశ్రామికోత్పత్తి సూచీ గణంకాలను విడుదల చేయనుంది. ఏప్రిల్తో పోల్చితే మే మాసంలో తయారీ రంగం కొంత మెరుగ్గా ఉండొచ్చని ఎస్బీఐ గ్రూపు చీఫ్ ఎకనామిస్టు ఎస్కె ఘోష్ అన్నారు. లాక్డైన్ వల్ల జీడీపీ వృద్ధి మొత్తం తుడుచుకుపెట్టుకుపోనుందని ఎస్బీఐ రిపోర్టు పేర్కొంది. 2019-20లో మొత్తం స్థూల దేశీయోత్పత్తి రూ.147 లక్షల కోట్లుగా ఉండగా.. జూన్ ఒక్క త్రైమాసికంలో రూ.37 లక్షల కోట్ల అంచనా కాగా.. ఈ ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోనుంది. జూన్ మాసం చివరి నాటికి దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరొచ్చని ఈ రిపోర్టు పేర్కొంది.