Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అనుమానాస్పద నగదు లావాదేవీలు, విదేశాల నుండి వచ్చిన నిధులను బహిర్గతం చేయకపోవడం వంటి ఆరోపణలపై తబ్లిగీజమాత్ నిర్వహకులపై ప్రాథమిక విచారణను సీబీఐ ప్రారంభించింది. ఈ వివరాలు ఆ సంస్థ యాజమాన్యం, ట్రస్టీలు వెల్లడించలేదన్న ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణకు మొగ్గుచూపుతోందని దర్యాప్తు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఫిర్యాదు చేసినవారెవరనే విషయాన్ని భయటపెట్టలేదు. విదేశీ నిధుల వ్యవహరంలో విదేశీ సహకార (రెగ్యులేషన్) చట్టాన్ని తబ్లిగీ జమాత్ నిర్వహకులు ఉల్లంఘించాన్న అంశాన్ని సీబీఐ నిర్ధారించనుంది. తగిన సాక్ష్యాధారాలు లభించిన అనంతరం దీన్ని రెగ్యులర్ కేసుగా మార్చనున్నారు. నిజాముద్దీన్లో నిర్వహించిన తబ్లిగీజమాత్ సమావేశంపై ఐపీసీ, అంటువ్యాధుల నివారణ చట్టం, డిజాస్టర్ మేనేజింగ్ యాక్ట్, విదేశీయుల చట్టం కింద నమోదైన అన్ని అభియోగాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 47 చార్జ్షీట్లు నమోదు చేశారు. తబ్లిగీ జమాత్తో సంబంధాలున్న 960 మందిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బ్లాక్లిస్ట్లో పెట్టింది.