Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : బీహార్ బోధ్గయాలో 2018 బాంబు పేలుడు కేసులో అనుమానితుడు జమాత్-ఉల్-ముజాయిద్దీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) అగ్ర నేతను పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు ఉన్నతాధికారి వెల్లడించారు. ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ అలియాస్ బోరో కరీమ్ను కోల్కతా పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్్, ముర్షిదాబాద్ జిల్లా పోలీసులు, స్థానిక అధికారులు ఉమ్మడిగా కృషిచేసి సుటీ పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. బోధ్గయాలో పేలుళ్లకు పాల్పడిన బంగ్లాదేశ్కు చెందిన జెఎంబి నేతలకు కరీమ్ ఆశ్రయం కల్పించారని తెలిపారు. ఆ సమయంలో కరీమ్ నివాసం నుండి పెద్ద మొత్తం మందుగుండు సామాగ్రితో పాటు వారికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పట్లో కరీమ్ను పట్టుకోలేదని, నిందితుడి కోసం కొంతకాలంగా వెతుకున్నామని తెలిపారు. ఈ కేసులో కరీమ్ పేరును జాతీయ దర్యాప్తు సంస్థ చార్జ్షీట్లో పేర్కొనలేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.