Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనెక్స్ భవనంలో రెండంతస్తులు మూత
న్యూఢిల్లీ : రాజ్యసభ సెక్రటేరియట్లో డైరెక్టర్ స్థాయిలో పనిచేసే మరో పార్లమెంట్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో అధికారి కుటుంబం మొత్తానికీ వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఈ నెల 28న సదరు అధికారి విధులకు హాజరవ్వడంతో పార్లమెంట్ అనెక్స్ భవనంలోని రెండు అంతస్తులను మూసివేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్లో ఇది నాలుగో కరోనా కేసు. ఇంతకుముందు లోక్సభ సెక్రటేరియట్లో ఒక ఉద్యోగికి కరోనా సోకిన విషయం తెలియడంతో అధికారులు విధులు ప్రారంభించడానికి ముందు భవన ప్రాంగణాన్ని క్రిమి సంహారకాలతో శుభ్రం చేశారు. అప్పటి నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగులందరూ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాతే పార్లమెంట్లోకి అనుమతిస్తున్నారు. అలాగే అన్ని వాహనాలనూ శానిటైజ్ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తున్నారు.
లాక్డౌన్ సడలింపులో భాగంగా హెయిర్ సెలూన్, బ్యూటీ పార్లర్కు అనుమతి
లాక్డౌన్ సడలింపులో భాగంగా హెయిర్ సెలూన్ షాపులను తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా సెలూన్ షాప్స్ తెరవడంతో పాటు వచ్చే కస్టమర్స్ కోసం పలు షాప్స్ ఓనర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ సడలింపులో భాగంగా దేశ వ్యాప్తంగా హెయిర్ సెలూన్, బ్యూటీ పార్లర్ తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దాంతో సెలూన్, పార్లర్ సిబ్బంది సిబ్బంది ఫుల్ బిజీగా మారాయి.
. కస్టమర్లు ఒక్కసారిగా రావడంతో వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సర్వీస్ చేసే వారు చెబుతున్నారు.
సెలూన్ షాప్ కి చాలా మంది ఒకే సారి వచ్చినా.. లిమిటెడ్ కస్టమర్స్ ని మాత్రమే సర్వీస్ అందిస్తున్నామని చెబుతున్నారు. అలాగే ఒక పర్సన్ కి వాడిన వస్తువులను వాటిని పూర్తిగా క్లీన్ చేయ్యడానికి స్పెషల్ గా శానిటైజ్ చేస్తూ.. మంట పెడుతున్నామని.. దీంతో కస్టమర్స్ కూడా సేఫ్ గా ఉంటారని సెలూన్ షాప్ ఓనర్ వెల్లడిస్తున్నారు.. మొత్తానికి లాక్డౌన్ సడలింపుతో సెలూన్ షాప్స్ కి గిరాకీ పెరిగింది.. కరోనా నేపథ్యంలో సెలూన్ షాప్స్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి..