Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 2కు విచారణ వాయిదా
న్యూఢిల్లీ : మన దేశాన్ని 'ఇండియా' అనే బదులుగా 'భారత్' లేదా 'హిందూస్తాన్' అని పిలవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటీషన్ను జూన్ 2న సుప్రీంకోర్టు విచారించనుంది. 'భారత్ లేదా హిందుస్తాన్ అని పిలిస్తేనే మనకు గర్వంగా ఉంటుంది' అని ఢిల్లీకి చెందిన వ్యక్తి వేసిన పిటీషన్లో పేర్కొన్నారు. ఇంగ్లీష్ పేరును తొలగించి భారత్తో భర్తీ చేయడం వల్ల భావితరాలకు మన చరిత్ర గురించి తెలుస్తుందని, దేశం కోసం ప్రణాలు కోల్పోయి వారు సాధించిన స్వాతంత్య్రానికి న్యాయం చేకూరుతుందని తెలిపారు. అలాగే రాజ్యం భూభాగం, పేరు నిర్వహించే రాజ్యంగంలోని ఆర్టికల్-1 సవరణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని పిటీషన్లో పేర్కొన్నారు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ పిటీషన్ను శుక్రవారం విచారించాల్సి ఉండగా, చీఫ్ జస్టిస్ ఎస్ఎ బొబ్డో అందుబాటులో లేకపోవడంతో జూన్ 2కు వాయిదాపడింది.